Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్రంలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) దూకుడు కొనసాగుతుంది. వరుస కూల్చివేతలతో అక్రమార్కులు, కబ్జాకోరులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చెరువులు, నాలాల ఆక్రమణలకు పాల్పడి, అనుమతులు లేకుండా భవనాలు నిర్మించిన వారి జాబితాను సిద్ధం చేసి పక్కా సమాచారంతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం నగర పరిధిలోని గగన్పహాడ్ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. అప్పా చెరువుకు అక్రమించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలు భారీ బందోబస్తు నడుమ సిబ్బంది బుల్డోజర్లతో నేలమట్టం చేయిస్తున్నారు. మరోవైపు స్థానిక రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు మరిన్ని నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గంగారాం పెద్ద చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా, ఒకటి,రెండు రోజుల్లో గంగారాం చెరువు ఆక్రమణలను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : బ్యాంకర్లనూ భయపెడుతున్న హైడ్రా
Admin
Ekaburu