Friday, 19 June 2026 03:52:44 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత

శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తీసుకువస్తాం : కొమిరిశెట్టి సాయిబాబా

Date : 11 December 2025 08:17 PM Views : 359

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని బీజేవైఎం సభ్యులు గురువారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ. రామారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో నూతనంగా పార్టీలో చేరుతున్న యువత, బీఆర్ఎస్ నాయకులు గురువారం భారీ ఎత్తున నంది నగర్ లోని కేటీఆర్ నివాసానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువాలతో కేటీఆర్ స్వాగతం పలికారు.

Also Read : మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు

నూతనంగా పార్టీలో చేరిన వారు సీనియర్ నాయకుల సలహాలు, సూచనలతో నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. అనంతరం కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లిన ఘనత కెసిఆర్, కేటీఆర్ లకు దక్కుతుందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పడకేసిందని అన్నారు. శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి రానున్న ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: