Friday, 19 June 2026 03:54:20 AM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

నానక్ రాంగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా

బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు : సాయిబాబా

Date : 03 May 2024 11:14 PM Views : 3648

Ekaburu - శేరిలింగంపల్లి / రంగారెడ్డి : పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ గచ్చిబౌలి డివిజన్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించిన సాయిబాబా చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Also Read : ఎలుకలు పట్టే ఉద్యోగం... ఏడాదికి రూ.1.2 కోట్ల జీతం..

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి హ్యాట్రిక్ విజయం నమోదు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నేడు తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి, ఎన్నికల్లో తమ అభ్యర్థికి భారీ ఆధిక్యాన్ని అందజేస్తామని అన్నారు.

అంతకుముందు నానక్ రాంగూడ ప్రభుత్వ పాఠశాల వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: